Featured

రెండువేల ఏళ్ల చరిత్ర సాక్ష్యాలు

ఫణిగిరి శిథిల మ్యూజియంలో పడిఉన్న శిల్పాలు. క్రీస్తుపూర్వం వెలసిన బౌద్ధ ఆరామాల్లో ఫణిగిరి ముఖ్యమైనది. మౌర్యులు, శాతవాహనులు మొదలు ఇక్ష్వాకుల కాలం వరకు ఈ ప్రాంతం బౌద్ధతత్వ బోధనలతో విలసిల్లినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడ ఫణి ఆకారంలో పరుచుకున్న కొండపై ఈ ఆరామ శిథిలాలు దొరికాయి.

కొండపై పెద్ద ఇటుకలతో ఒక స్తూపం శిథిలమై ఉంది. దానిని పునరుద్ధరించే పని మొదలుపెట్టారు కానీ పూర్తి చేయలేదు. శిల్పాలు కొన్ని కాలచక్ర సందర్భంగా అమరావతికి తరలించారు. అవి తిరిగి రాలేదని స్థానికులు చెప్పారు. కొన్ని హైదరాబాద్‌ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. ఇక్కడికి శ్రీలంక, థాయ్‌లాండ్, జపాన్‌ వంటి దేశాల నుంచి బౌద్ధ బిక్షువులు వచ్చిపోతుంటారని స్థానికులు చెప్పారు.

ఈ కొండ ఫణి మాదిరిగా మలుపు తిరగడంతో ఒక సహజసిద్ధమైన కొండ లోయ ఏర్పడింది. ఆ లోయలో ఆ తర్వాత ఒక పురాతన రామాలయం వెలసింది. అనతరం రాజ వంశాలు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు.

Featured

మాయావి

వాడు ఆకాశాన్ని చూపించి నేలను అమ్మేస్తాడు

వాడు ఆకాశాన్ని చూపించి నేలను అమ్మేస్తాడు

అబద్దాలను గుప్పించి సత్యాలను సమాధి చేస్తుంటాడు

మాటలను అమ్మి కోటలను కాజేస్తుంటాడు

గాలిని సృష్టించి కళ్ళల్లో దుమ్ముకొడుతుంటాడు

వాడు గారడీకి ఎక్కువ, లత్కోరు సాబుకు తక్కువ.

వాడికి పంచుకోవడం తెలియదు గుంజుకోవడం తప్ప

ప్రేమించడం తెలియదు ద్వేషంతో వ్యాపారం చేయడం తప్ప

వాడు గతాన్ని అమ్ముతుంటాడు రకరకాల రంగులద్ది

వర్తమానాన్ని కొల్లగొడతాడు కళ్ళకు గంతలు కట్టి

భవిష్యత్తును మాయం చేస్తాడు ఉన్నది ఊడగొట్టి

మరీచికలకు, మారీచులకు, మాయలేడిలకు తోబుట్టువు

ప్రజాస్వామ్యం కంటే రాచరికమే గొప్పదని నమ్మేవాడు

మానవధర్మం కంటే మనుధర్మం గొప్పదని భోధించేవాడు

శ్రమధర్మం కంటే వర్ణధర్మం మేలని వాదించేవాడు

కలిమిలేములు పూర్వజన్మసుకృతాలని నమ్మిస్తాడు

పెట్టుబడి, కట్టు కథలతో వాడిది రక్త సంబంధం

రాజ్యాన్ని వ్యాపారంగా మార్చినవాడికి

చట్టసభలను మార్కెట్లుగా మలిచినవాడికి

నీతి ఏమిటి అవినీతి ఏమిటి

దేశాన్ని వాటాలు చేసి షేర్లుగా మార్చేవాడికి

స్వార్థ త్యాగాలతో పని ఏముంది?

– రాచకొండ సిద్ధార్థ

Featured

సాగునీరు గుంజుకుంటారా?

రాచకొండ రాజా సిద్ధార్థ

కృష్ణా, గోదావరి నీటియాజమాన్య బోర్డులకు రెండు రాష్ట్రాల్లోని మొత్తం ప్రాజెక్టులను అప్పగిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ దుర్మార్గమైనది. ఇది రాష్ట్రాల హక్కులను కాలరాసే చర్య. ఎప్పుడైనా జలవివాదాలు వస్తే నదిపై రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్మించుకున్న ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రెండు రాష్ట్రాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లోని మొత్తం ప్రాజెక్టులను తమ అధీనంలోకి గుంజుకున్నది. తెలంగాణ నుంచి కేంద్రం ఏదో ఒకటి గుంజుకోవడం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే ఏడు మండలాలను ఏకపక్షంగా గుంజుకుని ఆంధ్రలో విలీనం చేసింది. ఇప్పుడు నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలోనూ అదే పనిచేసింది. తెలంగాణ అభ్యంతరాలను ఏమాత్రం ఖాతరు చేయకుండా అడ్డగోలుగా గెజిట్‌ జారీ చేసింది. గతంలో ఏ నదీ బోర్డుకూ ఇటువంటి అధికారాలు అప్పగించలేదు.

1. సాధారణంగా నదీ జలాల పంపిణీకి కేంద్రబిందువులుగా ఉన్న నదిపై నిర్మించిన ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణకు అప్పగిస్తారు. కృష్ణా, గోదావరి నదుల బోర్డులకు కోయిల్‌సాగర్‌, గండిపేట, హిమాయత్‌సాగర్‌, మూసీ, లక్నవరం, పాకాల, షామీర్‌పేట వంటి రిజర్వాయర్లను కూడా బోర్డు పరిధిలోకి ఎలా తెస్తారు? దీనివెను రహస్యం ఏమిటి?

2. గోదావరి నది నుంచి కృష్ణా నదికి నీటిని అనుసంధానం చేశారనే పేరుతో దేవాదుల కింద ఉన్న అన్ని పథకాలను, శ్రీరాంసాగర్‌ దిగువన ఉన్న అన్ని పథకాలను బోర్డుల పరిధిలోకి తెచ్చారు. కేంద్రానికి న్యాయంగా వ్యవహరించే ఉద్దేశమే ఉంటే కృష్ణా నది నీటితో నింపుతున్న సోమశిల, కండలేరు, మైలవరం, గండికోట వంటి రిజర్వాయర్లను బోర్డు పరిధిలోకి ఎందుకు తేలేదు?

3. నీళ్ల పంచాయతీకి సహకరించనిది ఎవరు? గత రెండు మూడేళ్లుగా కాలువలపై నీటిమీటర్లు పెట్టి ఏ ప్రాంతానికి ఎంత నీరు వెళుతుందో లెక్కలు తేల్చమని తెలంగాణ కోరుతూ వచ్చింది. రాయలసీమ కాలువలపై ఎందుకు నీటి మీటర్లు పెట్టలేకపోయింది? భద్రత లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్లలేకపోతున్నామని చెప్పింది బోర్డు నియమించిన అధికారులే కదా? మరి శిక్ష తెలంగాణకు ఎందుకు?

4. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టులు, పూర్తయి నీళ్లు కూడా అందిస్తున్న ప్రాజెక్టులకు ఇప్పటికీ అనుమతులు లేవని ఎలా నమోదు చేస్తారు? శ్రీశైలం కుడికాలువకు ఉన్న అనుమతి శ్రీశైలం ఎడమకాలువకు ఎందుకు లేదు? బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి తెలంగాణ హక్కుగా ప్రారంభించిన ప్రాజెక్టులు. వాటిని కూడా అనామోద ప్రాజెక్టులుగా చూపి, రాయలసీమవైపు అడ్డగోలుగా విస్తరించిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఆమోదం పొందిన ప్రాజెక్టు అవుతుందా?

5. తాగునీటి పథకాలను కూడా బోర్డులకు అప్పగించడంలోని ఆంతర్యం ఏమిటి? కష్టపడి నిర్మించుకున్నది ఎవరు? ప్రజలకు తాగునీటి కొరత తీర్చిన ఈ ప్రాజెక్టులను బోర్డుకు ఎలా అప్పగిస్తారు? చివరకు మిషన్‌ భగీరథ, హైదరాబాద్‌కు తాగునీరు అందించే పథకం కూడా మీరే లాగేసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏమిచేయాలి? షెడ్యూలు 1లో పేర్కొన్న ప్రాజెక్టులపై బోర్డులకు అధికారాలుంటాయని చెప్పిన గెజిట్‌, షెడ్యూలు3 లో పేర్కొన్న ప్రాజెక్టులన్నింటిని బోర్డుకు సమాచారమిచ్చి రాష్ట్రప్రభుత్వమే నడుపుకోవచ్చునని పేర్కొంది. అక్కడ అధికారం ఏమిటి? ఇక్కడ మీరే నిర్వహించుకోమనడం ఏమిటి? ఈ వైరుధ్యం ఏమిటి?

6. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని వివరిస్తూ జారీ చేసిన గెజిట్‌ రాజ్యాంగ విరుద్ధం. రాష్ట్ర హక్కులను కాలరాసే గెజిట్‌. పునర్విభజన చట్టం ప్రకారం చేశామని కొంతమంది అజ్ఞానులు మాట్లాడుతున్నారు.  రాజ్యాంగంలో పేర్కొన్న కేంద్ర, రాష్ట్రాల పరిధుల్లోని జాబితాల ప్రకారం నీటి సరఫరా, నీటిపారుదల, కాలువలు, డ్రైనేజీలు, తీరప్రాంత నిర్వహణ, నీటి నిల్వ, జలవిద్యుత్‌ వంటి అంశాలన్నీ రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

17. Water, that is to say, water suppliesirrigation and canals, drainage and embankmentswater storage and water power subject to the provisions of Entry 56 of List I.

పునర్విభజన చట్టంలో నదులపై నిర్మించిన హెడ్‌వర్క్స్‌-ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, పవర్‌హౌజులు, కాలువలకు బోర్డుల అధికారాన్ని పరిమితం చేస్తే కేంద్రం మాత్రం జులుం ప్రదర్శించి రెండు రాష్ట్రాల్లోని మొత్తానికి మొత్తం నీటివనరులను బోర్డులకు అప్పగించింది. పునర్విభజన చట్టంలోని ఈ పేరా చూడండి:

A Section from AP Reorganisation Act 2014

ఇందులో ఎక్కడైనా పరివాహక ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువులు అన్ని బోర్డు పరిధిలో చేర్చాలని ఉందా?

7. కావేరి నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేశారా? అప్పుడు ఇలాగే చేశారా? కేరళ, కర్నాటక, తమిళనాడు- మూడు రాష్ట్రాలలో కలిపి తొమ్మిది ప్రధాన రిజర్వాయర్లను బోర్డు పరిధిలో పెట్టారు. అన్నీ ప్రధాన నది, పెద్ద ఉపనదులపై ఉన్నవే. వాగులు, వంకలు, చిన్న చిన్న నదులపై ఉన్న రిజర్వాయర్లు కాలువల జోలికి వారు వెళ్లలేదు.

8. తెలంగాణకు కృష్ణా నదీ జలాల్లో 299 టీఎంసీల నికరజలాల కెటాయింపు ఉంది. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల ఈరోజుకు కూడా 260 టీఎంసీలకు మించి వాడుకోలేకపోతున్నది. గత రెండేళ్ల జలవినియోగ గణాంకాలే ఇందుకుసాక్ష్యం. రాయలసీమకు కృష్ణా జలాల్లో ఉన్న నికరజలాల కెటాయింపు ఎంత? రాయలసీమకు హక్కుగా ఉన్న 144 టీఎంసీలలో 101  టీఎంసీలు నికర జలాలు తుంగభద్ర, దాని ఉపనదులపైనుంచే కెటాయించారు. శ్రీశైలం నుంచి ౩౦ టీఎంసీలు మాత్రమే నికరజలాల కెటాయింపు ఉంది. మరి అటువంటప్పుడు తొండి చేస్తున్నదెవరు? పంచాయితీ పెడుతున్నదెవరు? పిల్లి పాత్ర పోషిస్తున్నదెవరు?

9. జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జలాలను మరో నదీవాహక ప్రాంతానికి తరలించడానికి ఈ తగాదా అంతా కావాలని సృష్టిస్తున్నారు. నిజానికి కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఈరోజుకు కూడా వారి వాటా జలాలు వారికి దక్కడం లేదన్నది వాస్తవం. కృష్ణా పరివాహక ప్రాంతం/ తుంగభద్ర పరివాహక ప్రాంతం ఉన్నది ఈ రెండు జిల్లాలలోనే. తుంగభద్ర నుంచి 62 టీఎంసీలు హెచ్‌ఎల్‌సీ ద్వారా, కడప కర్నూలు కాలువ ద్వారా 32 టీఎంసీలు రావాలి. కానీ రావడం లేదని కర్నూలు, అనంతపురం జిల్లాలు మొదటి నుంచీ ఫిర్యాదు చేస్తున్నాయి. హంద్రీ నీవా ఆ లోటు తీర్చడానికే కట్టామని చెబుతున్నారు. మరి దాని సామర్థ్యం ఎంత? పోతిరెడ్డిపాడు సామర్థ్యం ఎంత? కేంద్రం ఈ అంశాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా గెజిట్‌ జారీ చేస్తే అన్యాయం కాదా?

10. పట్టిసీమ నుంచి ఏటా 80 నుంచి 100 టీఎంసీల వరకు డెల్టాకు తెస్తున్నారు. అంటే కృష్ణా ఆయకట్టు కింద   ఆంధ్ర ప్రాంతానికి కెటాయించిన 367.34 టీఎంసీలకు ఇవి అదనం. నిజానికి కృష్ణా డెల్టాకు అంతనీరు అవసరం లేదు. అక్కడ మిగిలిన నికరజలాలను అనంతపురానికి, కర్నూలుకు, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాలకు ఇవ్వాలి కదా? బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఆ ఆదేశాలను ఎందుకు ఖాతరు చేయడం లేదు.

Featured

Snatching away Krishna from Telangana

Normally On River reservoirs has to be taken to the control, but surprisingly BJP Govt. taken over Off River reservoirs too.

Raja Siddhartha

Narendra Modi Government done it again to Telangana. It snatched seven Telangana Mandals from Khammam District and handed over to Neihbour state in the name of Project immediately after coming to power in 2014.

Now its time of water resources. Its horrible. Undemocratic. Vengeful. Against federal spirit. Its surprise to see that Off River reservoirs too were handed over to Krishna Board.

Whenever there is a dispute On River reservoir water sharing, only those reservoirs were put under control of Boards. But BJP at Centre, seems to be with vengeance, submitted entire water sources under Krishna catchment area in Telangana to the Board. If Telangana wants to draw water from Gandipet too Board nod is a must now.

In real terms Rayalaseema dont have much claim on Srisailam or Krishna water, except from Tungabhadra. From Srisailam it can only have 34 TMC allocated water at the most, the-rest drawal must be flood waters.

But since last two years Rayalaseem drawn more water than Telangana. Where as Telangana has net allocated water of 299 TMCs. Still Central Government only listen to Jaganmohan Reddy and issued gazette notification taking over all the water resources under two major rivers in Two Telugu states.

Centre divided water sources into three categories. Water resources put under Schedule-I and schedule-II will be under full control of Board. Where as resources under schedule-III will be semi controlled by the board, but operated by States. Here is lists and schedules:

Featured

ఇదేమి దౌర్బ‌ల్యం

అయ్య‌లారా,

దేవుడిని స్తుతించిన‌వారూ మ‌ర‌ణించారు. నిందించిన‌వారూ మ‌ర‌ణించారు. ఏ న‌మ్మ‌కాలూ, విశ్వాసాలు లేని వారూ మ‌ర‌ణించారు. చ‌క్ర‌వ‌ర్తీ మ‌ర‌ణిస్తాడు. సామాన్యుడూ మ‌ర‌ణిస్తాడు. ముందు వెనుక‌లు అంతే. భ‌గ‌వ‌ద్గీత‌ను బోధించిన స‌ర్వ‌శ‌క్తిమంతుడు శ్రీ‌కృష్ణుడు బోయని విల్లుతో త‌నువు చాలించాడు.

స‌క‌ల స‌ద్గుణ రాముడు సైతం కాలంతీర‌గానే స‌ర‌యూన‌దిలో లీన‌మైపోయారు. శంక‌ర‌త‌త్వాన్నిలోకానికి బోధించిన ఆదిశంక‌రుడు సైతం అతిచిన్న‌వ‌య‌సులో మ‌ర‌ణించారు. భార‌తీయ అత్మ‌ను అంత‌ర్జాతీయ అవ‌నిక‌పై ఆవిష్క‌రించిన వివేకానందుడూ చిన్న‌వ‌య‌సులోనే మ‌ర‌ణించారు.

మనతో విభేదించేవారంతా పాపాత్ములు కాదు, మనతో ఏకీభవించేవారంతా పుణ్యాత్ములూ కాదు. మహేష్ కోసం ఎంతమంది అశ్రువులు రాల్చారన్నదే మనిషిగా ఆయన ఔన్నత్యానికి కొలమానం.

మ‌ర‌ణానికి వ‌యోభేదం లేదు. పాప‌పుణ్యాలు లేవు. గుణ‌గ‌ణ ల‌క్ష‌ణాల కొల‌మానాలు లేవు. చావుపుట్టుక‌ల‌కు మ‌తం లేదు, కాల్చినా పూడ్చినా గ‌ద్ద‌ల‌కు వేసినా అంతిమంగా ఏదేహ‌మైన క‌లిసేది మ‌ట్టిలోనే. మ‌త‌మేదైనా, దేశ‌మేదైనా స‌త్య‌మిదే.

ఆస్తికులైనా నాస్తికులైనా ఎప్పుడోఒక‌ప్పుడ మ‌ర‌ణం త‌థ్యం. బ‌తికిన‌న్నాళ్లూ మ‌నుషులుగా, మాన‌వ‌తామూర్తులుగా బ‌త‌క‌డం ముఖ్యం. చివ‌ర‌కు చావుల‌కు సంతోషించే దుస్థితి ఏ జాతికీ, ఏ మాన‌వుల‌కు పట్టగూడదు.

Featured

కృష్ణా జలాలపై జగన్‌ అడ్డగోలుతనం

రాయలసీమ ప్రాజెక్టును సమర్థించుకోవడంకోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. శ్రీశైలం రిజర్వాయరులో 881 అడుగుల వరకు నీరు నిండిన తర్వాతనే పోతిరెడ్డిపాడుకు పూర్తిస్థాయిలో నీరు తీసుకోగలుగుతామని జగన్‌రెడ్డి చెప్పారు. రిజర్వాయరులో 854 అడుగులు నిండేదాకా నీరు ఉపయోగించకుండా జగన్‌రెడ్డి తండ్రి వైఎస్‌ఆర్‌ అప్పట్లో ఒక జీవో తెచ్చారు. అంతేకాదు వైఎస్‌ఆర్‌ 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు కాలువను ఏకంగా మరో 44 వేలు క్యూసెక్కులు పెంచి మొత్తం సామర్థ్యాన్ని 55 వేల క్యూసెక్కులకు పెంచారు. అంటే రోజుకు 5  టీఎంసీల నీటిని తరలించే విధంగా ఆ కాలువ సామర్థ్యాన్ని పెంచారు. చంద్రబాబునాయుడు 2018 జూలైలో 841 అడుగుల నుంచే నీరు తోడుకునే విధంగా జీవో తెచ్చారు.

The A.P. government however upstaged Telangana by issuing a G.O. dated February 23, 2017 and reducing the level for drawing water from the head regulator to 841 ft. It even sanctioned Rs 17 crore to widen the approach channel of the regulator to draw water at that level.

                                       -The Hindu, July 24, 2018

శ్రీశైలం కుడికాలువ నీటి తరలింపు సామర్థ్యం 21000 క్యూసెక్కులు. తెలుగుగంగ నీటి తరలింపు సామర్థ్యం 1500 క్యూసెక్కులు. గాలేరు నగరి సుజల స్రవంతి కాలువ సామర్థ్యం 20000. కడప కర్నూలు కాలువ సామర్థ్యం 12500 క్యూసెక్కులు. ఈ కాలువల పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకుంటే రోజుకు 5 టీఎంసీల నీరు చొప్పున ‘ముప్పై వరద రోజుల్లో’(వైఎస్‌ఆర్‌ చెప్పిన మాటే) 150 టీఎంసీల నీరు రాయలసీమకు తరలించవచ్చు. వరద రోజులంటే రిజర్వాయరు పూర్తిగా నిండి కిందికి వదిలే కాలం. ఆ తర్వాత ఉపయోగించుకునే నీరంతా నికరజలాలకిందికి వస్తుంది. పోతిరెడ్డిపాడు కాలువపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టుల నీటి వినియోగ సామర్థ్యం 114 టీఎంసీలని ఆంధ్ర ఇంజనీర్లు అధికారికంగా చెబుతున్నారు.  వరద రోజుల్లో 150 టీఎంసీలు, ఆ తర్వాత 841 అడుగుల దాకా నికర జలాలు వాడుకునే అవకాశం ఉన్నప్పుడు రాయలసీమకు నీరు అందకపోవడం ఏమిటి బూటకం కాకపోతే! వరద జలాలు కాకుండా రాయలసీమకు వాడవలసిన నికరజలాలు 19 టీఎంసీలు మాత్రమే. తెలుగు గంగ ద్వారా చెన్నయికి మరో 15 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సంవత్సరం పొడవునా తరలించే నీటిపై హక్కు ఎక్కడిది?

Banakacharla Distribution Point: Water Drawing Canals from PotireddyPadu-SRBC, TG, GNSS, KC

అనంతపురం, కర్నూలుకు హక్కు

నిజానికి అనంతపురం, కర్నూలు జిల్లాలలో కొంత ప్రాంతం మాత్రమే కృష్ణా పరివాహక ప్రాంతం కిందకు వస్తుంది. ఆ రెండు జిల్లాలకు తుంగభద్ర నుంచి, కృష్ణ నుంచి నీటి కెటాయింపులు ఉన్నాయి. కానీ వారి వాటా జలాలు వారికి అందడం లేదని ఎప్పటి నుంచో ఫిర్యాదు ఉంది. వారికోసమే హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం తెచ్చారు. ముందు కర్నూలు జిల్లా మల్యాల వద్ద 834 అడుగుల నుంచి ఎత్తిపోసుకునే విధంగా లిఫ్టులు పెట్టారు. ఆ తర్వాత ఎత్తిపోయడానికి నీరు సరిపోవడం లేదని కర్నూలులోనే ముచ్చుమర్రి వద్ద మరో ఎత్తిపోతల పథకం తెచ్చారు. ఈ ఎత్తిపోతల పథకం 800 అడుగుల లోతు నుంచి కూడా నీటిని తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఈ రెండు లిఫ్టులూ హంద్రీ-నీవాకోసమే ఏర్పాటు చేశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతలను కర్నూలు కడప కాలువకు కూడా లింకు చేశారు. ఇంతా చేసి హంద్రీ-నీవా ప్రధాన కాలువ నీటి తరలింపు సామర్థ్యం 3850 క్యూసెక్కులు మాత్రమే. నిజానికి తరలిస్తున్నది ఇంకా తక్కువ నీరే. కాలువేమో కర్నూలు నుంచి కుప్పం దాకా తవ్వుకుంటూ పోయారు. డజను రిజర్వాయర్లు పెట్టారు. ఎవరికీ నీరు సరిగా అందదు. నిజమైన హక్కుదారులకు నీరు తగినంతగా రాదు. పెన్నా పరివాహక ప్రాంతమైన కడప, నెల్లూరు జిల్లాలకు మాత్రం పుష్కలంగా నీరు అందుతుంది.  పోతిరెడ్డిపాడు నుంచి ఇంకేమాత్రం నీటిని తీసుకోవడం సహించరాదు. హంద్రీ-నీవాకు తగినంత నీరివ్వడానికి ముచ్చుమర్రి మల్యాల లిఫ్టుల సామర్థ్యం పెంచవచ్చు. ప్రధాన కాలువ సామర్థ్యం పెంచవచ్చు. వరద రోజుల్లో వీలైనంత ఎక్కువ నీటిని తరలించడానికి వీలవుతుంది. త్వరగా అనంతపురం ఆ చివరి రిజర్వాయర్లకు కూడా నీరు చేరుతుంది.

కొత్త ప్రాజెక్టు కొత్త కాంట్రాక్టు

అది వదిలేసి కాంట్రాక్టుకోసమో, రాజకీయ కయ్యం కోసమో రాయలసీమ పథకం అంటూ మరొకటి తెచ్చారు జగన్‌. ఇది కచ్చితంగా నదీజలాల వినియోగ నియమాలకు విరుద్ధం. అడ్డగోలుతనం. తన తండ్రి పోతిరెడ్డిపాడును తవ్వినట్టే తానూ ఏదైనా చేయవచ్చునని బరితెగించడం. గత రెండేళ్లలో నీటి లెక్కలు చెబుతున్నాయి ఏ రాష్ట్రం ఎంత నీరు వాడుకున్నదో కేఆర్‌ఎంబీ వద్ద ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో కృష్ణా నీటిలో ఆంధ్రప్రదేశ్‌ వాడుకున్నది 637 టీఎంసీలు, తెలంగాణ వాడుకున్నది 260 టీఎంసీలు. ఇందులో శ్రీశైలం నుంచి ఆంధ్ర అంటే రాయలసీమకు వాడుకున్నది 220.3 టీఎంసీలు. తుంగభద్ర నుంచి అంటే రాయలసీమకు వాడుకున్నది 78.169 టీఎంసీలు. ఇవి అధికారిక లెక్కలే.  అదేవిధంగా 2020-21 సంవత్సరంలో  కూడా తెలంగాణ 255 టీఎంసీలు మాత్రమే వాడుకున్నది. తెలంగాణ కృష్ణా ప్రాజెక్టులపై ఎక్కడా రిజర్వాయర్లు నిర్మించకుండా, కేవలం పెద్ద పెద్ద లిఫ్టుల కింద కూడా పారుగంతకాలువలు తవ్వి వదిలేశారు. అందువల్ల తెలంగాణ పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నది. ఇదే సంవత్సరంలో ఆంధ్ర 600 టీఎంసీలకంటే ఎక్కువ వాడుకున్నది. దిగువ ఇచ్చిన టేబులు చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైటులో శుక్రవారం (09.07.2021) నాటి సమాచారం. ఈ సారి ఎక్కడా వర్షాలు వరదలు ఇంకా ప్రారంభం కాని విషయం అందరికీ తెలుసు. అయినా  కృష్ణా ప్రాజెక్టులలో పోయిన ఏడాది కంటే ఈ ఏడాది ఇప్పటికి  26 టీఎంసీల నీరు అదనంగా ఉంది. అదే విధంగా పోతిరెడ్డిపాడు కాలువకు లింకయిన పెన్నా ప్రాజెక్టుల్లో చూడండి పోయిన సంవత్సరం ఈరోజు కంటే ఈ సంవత్సరం ఈరోజు 74 టీఎంసీల నీరు అదనంగా ఉంది. పోయిన సంవత్సరం ఈనాటికి 63.4 టీంఎసీలు ఉంటే ఈ సంవత్సరం ఈరోజుకు 137.3 టీఎంసీల నీరు ఉంది. జగన్‌ పేద అరుపులు, పెడబొబ్బలు అన్నీ అబద్ధాలని ఈ లెక్కలు చెప్పడం లేదా?

River water monitoring dashboard of AP

ఇంకా వివరాలు కావాలంటే ఈ దిగువ టేబులు చూడండి-  ఈ సంవత్సరం ఈరోజు అంటే జులై 9, 2021 నాటికి పోతిరెడ్డిపాడుకు లింకయిన ఏ రిజర్వాయరులో ఎంత నీరు ఉందో తెలుస్తుంది. టేబుల్‌లో చివరి రెండు కాలమ్స్‌ రిజర్వాయరు పూర్తి సామర్థ్యం, ప్రస్తుత నిల్వ:

River water monitoring dashboard of AP

సీమకు నికరజలాలిస్తావా జగన్‌

ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. కృష్ణా డెల్టాకు పోలవరం నుంచి ప్రతి ఏటా 70 నుంచి 80 టీఎంసీల నీటిని తరలించి వాడుతున్నది. కృష్ణా నది నుంచి వాడుతున్నది కాకుండా ఇది అదనం. మరి నీటి సమస్య ఉన్నది ఎక్కడ? ప్రకాశం జిల్లాకు నీరివ్వడానికి ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే అక్కడికి రోజుకు ఒక టిఎంసీ నీటిని తరలించే అవకాశం ఆంధ్రకు వస్తుంది. వెలిగొండ సొరంగం కూడా వెళ్లేది శ్రీశైలం రిజర్వాయరు నుంచే. విద్యుత్‌ ఉత్పాదనకోసం, నాగార్జున సాగర్‌కు బఫర్‌కోసం నిర్మిస్తున్నామని చెప్పి శ్రీశైలం ప్రాజెక్టును పూర్తి చేశారు. రెండు వైపులా కరువు ప్రాంతాలను పెట్టుకుని కనీసం మంచి నీరన్నా ఇవ్వకుండా ఏమి దుర్మార్గం అని ఎన్‌టిఆర్‌ 1985లో అఖిలపక్షం పెట్టి శ్రీశైలం కుడి ఎడమకాలువలు నిర్మించి అటు 11 వేల క్యూసెక్కులు ఇటు 11 వేల క్యూసెక్కులు ఇద్దామని అందరినీ ఒప్పించారు. శ్రీశైలం కుడికాలువ, దానికి తోడు తెలుగు గంగ, దానికి తోడు కడప-కర్నూలు కాలువ,  ఆ తర్వాత గాలేరు నగరి అన్నీ వచ్చాయి కానీ శ్రీశైలం ఎడమకాలువ మాత్రం పూర్తి కాలేదు. శ్రీశైలం ఎడమకాలువ పూర్తి కాకముందే పోతిరెడ్డిపాడు సామర్థ్యం 55 వేల క్యూసెక్కులకు పెరిగింది. తెలంగాణకు 299 టీఎంసీల నికరజలాలతోపాటు వరద జలాలపై హక్కు ఉంది. రాయలసీమకు శ్రీశైలం నుంచి ఉన్న నికర జలాలు 19 టీఎంసీలు మాత్రమే. తుంగభద్ర జలాలు రాకపోతే నష్టపోతున్నది అనంతపురం, కర్నూలు. వారికి కృష్ణా నుంచి నికరజలాలను జగన్‌ కెటాయించలేదు. పోలవరం నుంచి తెస్తున్న నీటిని మిగిలించి ఆ నీటిని ఇక్కడ కెటాయిస్తూ జీవో ఇవ్వొచ్చు. ఆ పని చేయకుండా కొత్త ప్రాజెక్టు దిగడం అంటే బరితెగింపు తప్ప మరొకటి కాదు.

Sheer Political Arrogance

BJPs argument on delimitation is sheer political arrogance. A convenient play with Constitutional power. They say delimitation cannot be done until 2031 census completed. They do delimitation in Kashmir. They bring draconian acts and Constitutional changes at their will. But when it comes to implement an act made by themselves, meant for political stability in the newly formed, ignored again and again.

  1. Seven mandals from Telangana State, which are part of Bhadrachalam, Chinthakani assemly constituencies were snatched away and merged with AP State. And also these mandal were merged with two assembly constituencies in AP without following constitutional process of delimitation. Bhadrachalam, Chintakani Constituencies were reduced to less than half population, which is against natural justice.
  2. AP Reorganization Act prescribed to increase assembly seats in both states proportionately. But in the name of constitutional amendment, Central Government kept the issue under the carpet. But the same Government made constitutional amendments to increase the assembly seats in Jammu and Kashmir and also started delimitation process.
  3. To prove that one nation one constitution, Central Government taken the initiative in Kashmir and made all sorts of changes in polity. But when it comes Telugu States Centre chose to play gambling with constitutional obligations.

దేశమంతా ఒకదారి, మరి ఇక్కడ ఏదారి?

రాజాసిద్ధార్థ

భారతీయ జనతాపార్టీ గురించి, ప్రధాని నరేంద్రమోదీ గురించి దేశమంతా పునరాలోచన జరుగుతుంటే తెలంగాణలో మాత్రం వారికి వరమాలవేసే సమూహం ఒకటి తయారవుతున్నది. బీజేపీ, మోదీ దేశానికి ఏదో ఒక గొప్ప మేలు చేశారనే ఒక భ్రమను ఇప్పటికీ చెలామణి చేయగలుగుతున్నారు. నిజానికి మోదీ ప్రజలకు చేసింది ఏమీలేదు. ప్రజలనుంచి స్వీకరించింది ఎక్కువ. ప్రజలకు నష్టం చేసిందే ఎక్కువ. మోదీ, బీజేపీ ఎప్పుడూ తెలంగాణ మేలుకోరే వారు కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎప్పుడో తీర్మానం  చేసిన బీజేపీ ఆ తర్వాత ఇక్కడి ప్రజలను వంచించి ఆ మాటే మరిచింది. తెలంగాణ ప్రజలు మళ్లీ పోరాటబాట పట్టినతర్వాతనే స్థానిక బీజేపీ శ్రేణులు కూడా కలసివచ్చాయి. అయినా పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమై ఉండి ఏరోజూ తెలంగాణ కోసం పట్టుబట్టలేదు. తెలంగాణ ఎంపీలు తమ ముందే సంవత్సరాల తరబడి ఒంటరిగా కొట్లాడుతున్నా ఉత్తరాది బీజేపీ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌ వర్కింగు కమిటీ తీర్మానం చేసిన తర్వాత బీజేపీ కూడా ఇక రాష్ట్ర ఏర్పాటు తప్పదని గుర్తించిన తర్వాత విభజన బిల్లుకు మద్దతు ప్రకటించింది. బిల్లు చట్టంగా మారే క్రమంలో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాల్సిన రాయితీల గురించి పట్టుబట్టింది తప్ప తెలంగాణకోసం ఒక్క డిమాండు కూడా పెట్టలేదు.

కేంద్రంలో తీరా యూపీఏ దిగిపోయి బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణకు సంబంధించిన ఏడుమండలాలను కనీసం అభిప్రాయం కూడా కోరకుండా ఆంధ్రలో కలుపుతూ మరో చట్టసవరణ తెచ్చింది. ఇది ఒక విధంగా బలవంతంగా తెలంగాణ నుంచి గుంజుకోవడమే. నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఎంతకోపం అంటే తల్లిని చంపి పిల్లను తీశారని హైదరాబాద్‌ సభలో వ్యాఖ్యానించారు. ఆంధ్ర తల్లిని చంపి తెలంగాణ పిల్లను బతికించారని ఆయన కవి హృదయం. ఎవరు తల్లో ఎవరు పిల్లో ఈ ఏడేళ్లలో తేలిపోయింది. మోదీ తెలంగాణకే కాదు ఆంధ్రకు కూడా చేసింది ఏమీలేదని అర్థమయింది. తెలంగాణకు ఇవ్వాల్సినవేవీ ఇవ్వలేదు. తెలంగాణ నీటిపారుదల ప్రాజెక్టులలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరింది. పోలవరం ప్రాజెక్టుకు ఆ హోదా ఇచ్చింది తప్ప తెలంగాణ డిమాండును పట్టించుకోలేదు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు. అదీలేదు. బయ్యారం గనులతో ఇనుము కర్మాగారం పెడతామని హామీ ఇచ్చారు అదీ జరుగలేదు.

దేశమంతా 27 వేల కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా రెఫరల్‌ ఆసుపత్రులలో 157 వైద్యకళాశాలలను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 27, రాజస్థాన్‌లో 23, మధ్య ప్రదేశ్‌లో 14, పశ్చిమబంగ్లాలో 11, తమిళనాడులో 11  వైద్య కళాశాలలు మంజూరు చేశారు.  ఈ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు మూడు కళాశాలలు ఇచ్చారు. తెలంగాణకు మాత్రం ఏడేళ్లలో ఒక్కటంటే ఒక్క కళాశాల కూడా ఇవ్వలేదు. పునర్విభజన చట్టంలో రాష్ట్ర శాసనసభ స్థానాల సంఖ్యను 153కు పెంచాలని పేర్కొన్నా ఇప్పుడప్పుడే చేసేది లేదని మొండికేసింది. తమ తప్పిదాలవల్ల సత్తెనాశనమైన కశ్మీరులో మాత్రం ఎప్పుడంటే అప్పుడు పునర్విభజన చేసుకోవడానికి బీజేపీ సిద్ధపడింది. దేశవ్యాప్తంగా 1750 మెడికల్‌ పీజీ సీట్లు పెంచింది బీజేపీ ప్రభుత్వం. తెలంగాణకు మాత్రం ఒక్కటీ దక్కలేదు. బీజేపీ వివక్షాపూరిత విధానాలకు ఇంతకంటే నిదర్శనాలు ఏమి కావాలి?

నరేంద్రమోదీ నీతిమంతుడా?

ప్రధాని నరేంద్రమోదీ నీతిమంతుడని ఆయనను బాగా ప్రేమించేవాళ్లు పదేపదే చెప్పే విషయం. నీతి అంటే ఏమిటో ఆ మిత్రులకు తెలియదనుకోలేము. ‘బీజేపీ భిన్నమైన పార్టీ. కాంగ్రెస్‌ చేసిన తప్పిదాలు మేము చేయం. ప్రజాప్రతినిధులను సంతల్లో సరుకులుగా మార్చం. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయం. ముఖ్యమంత్రులను పదేపదే మార్చే సంస్కృతిని నిర్మూలిస్తాం’ ఇలా ఎన్ని మాటలు చెప్పారు బీజేపీ నాయకులు. కానీ ఈ ఏడేళ్లలో ఏమి జరిగింది. ఎంతమంది ఎమ్మెల్యేలను కొన్నారు? మధ్యప్రదేశ్‌, మణిపూర్‌, కర్ణాటక రాష్ట్రాల్లో ఏం జరిగింది? ఎంతమంది ఎంపీలను కొన్నారు? ఎన్నికల్లో  మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఎలా ఖర్చుపెడుతున్నారు? దేశదేశాల్లో వేలాది మంది సోషల్‌ మీడియా కార్యకర్తలను ఎవరు ఎలా పోషిస్తున్నారు? పార్టీ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాలు ఎలా మారిపోతున్నాయి?

గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, గోవాలలో ఎంతమంది ముఖ్యమంత్రులను మార్చారు? బంగ్లా, పుదుచ్చేరి, కేరళరాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయ నాయకుల్లా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కాంగ్రెస్‌ కంటే బీజేపీ ఏవిధంగా భిన్నమైనదో ఇప్పుడు చెప్పాలి. భావ‌జాలాలు, విధానాలు, సూత్ర‌బ‌ద్ధ రాజ‌కీయాలు అంత‌రించి అవ‌కాశ‌వాదం మాత్ర‌మే రాజ్యం చేస్తున్నది. వ్య‌క్తుల అవినీతికంటే వ్య‌వ‌స్థ అవినీతి ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. వ్య‌క్తుల ప‌త‌నం కంటే వ్య‌వ‌స్థ‌ల ప‌త‌నం ప్ర‌జాస్వామ్యానికి హానిక‌రం. విద్వేష‌పూరిత రాజ‌కీయాల‌ను ప్రేరేపించ‌డం, తొత్తు పారిశ్రామికవేత్త‌ల‌కు అనుకూలంగా విధానాలు, నిర్ణ‌యాలు చేయ‌డం, ప్ర‌భుత్వ‌రంగాన్ని టోకుగా అమ్మ‌కానికి పెట్ట‌డం…ఇవ‌న్నీ అవినీతి రాజ‌కీయాల‌కు ప‌రాకాష్ఠ‌. బీజేపీని చూసి మునుపే బాగుండెన‌ని బాధ‌ప‌డేవారి సంఖ్య పెరిగిపోతున్న‌ది. న‌రేంద్ర మోదీపై పెంచుకున్న భ్ర‌మ‌లు కూలిపోతున్నాయి.

నరేంద్రమోదీ ప్రభ తగ్గిపోతున్నది

రెండేళ్ల‌క్రితం జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో సొంతంగా లోక్‌స‌భ 303 సీట్ల‌ను గెల్చుకుని చ‌రిత్ర సృష్టించిన మోదీ ఇప్పుడు దిగుడుమెట్ల‌పై నిల‌బ‌డి ఉన్నాడు. ఆర్థిక రంగంలో ఆయ‌న చేసిన నిర్ణ‌యాలేవీ సామాన్యుల‌కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అన్నీ జ‌నం జేబుల‌ను ఖాళీ చేసే సాధనాలే అయ్యాయి. న‌ల్ల‌డ‌బ్బును ఖ‌తం చేస్తామ‌ని చెప్పి తెచ్చిన డీమానిటైజేష‌న్ జ‌నం వ‌ద్ద డ‌బ్బులు లేకుండా చేసింది త‌ప్ప న‌ల్ల‌డ‌బ్బును నిర్మూలించ‌లేదు. ప్ర‌తి మ‌నిషికి ఒక బ్యాంకు ఖాతా, ఒక కార్డు వ‌చ్చాయే త‌ప్ప చేతిలో డ‌బ్బులేకుండా పోయింది. న‌ల్ల‌ధ‌నం వేరే ఎక్క‌డో పోగుబ‌డిపోతున్న‌ది. రియ‌ల్ ఎస్టేట్‌లో, ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో, రాజ‌కీయ ప్రాపగాండాలో న‌ల్ల‌ధ‌న‌మే క‌నిపిస్తున్న‌ది. ఎన్నికల సమయంలో తప్ప సామాన్యులు న‌గ‌దు చూడ‌క‌, రెండు వేల నోటు చూడ‌క చాలా కాలమవుతున్నది. ఈ ప్రభావంతోనే నరేంద్రమోదీ ప్రభ మసకబారిపోతున్నది. మహరాష్ట్ర, హర్యానా, ఒరిస్సా, జార్కండు, ఢిల్లీ, బీహారు, బంగ్లా, కేరళ రాష్ట్రాల్లో నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాలు స్వయంగా తాము పోటీస్తున్నట్టుగానే ప్రచారంచేసి ఓట్లు అడిగారు.

గత ఆరేడేళ్లలో తాను సాధించిన ఘనత గురించి సమస్త ప్రచారప్రసార సాధనాలను ఉపయోగించి టాంటాం చేశారు. ప్రత్యర్థులను అష్టదిగ్బంధం చేసి మరీ ఎన్నికలు జరిపించారు. అయినా ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. బీహారు, హర్యానాల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా బీజేపీ బతికి బట్టకట్టి ఉండవచ్చు.  మిగిలిన చోట్లంతా ప్రతిపక్షాలే పై చేయి సాధించాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికలలో ఉంటాయని ఎవరూ భ్రమ పడకూడదు. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈసారి ప్రజాగ్రహం వ్యక్తమయింది బీజేపీ పాలనపైనే. కేంద్రంలో ఎన్‌డీఉ ఎండి రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహారాష్ట్ర, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గడ్‌, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పరాజయం చవి చూడాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించిన కొన్ని రాష్ట్రాలు పార్లమెంటుకు వచ్చేసరికి మోదీ ఇమేజీ చూసి 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిపెట్టాయి. ఇప్పుడు అప్పటి ఇమేజీ లేదు. కోవిడ్‌ రెండవ ముప్పు మీదపడుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో మునిగి ఉండడం, బడిపిల్లలు పరీక్షలు ఎలా రాయాలో రేడియో ఉపన్యాసాలు రికార్డు చేసుకుంటూ గడపడం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇంత నిర్లిప్తంగా ఉండడం ఎలా సాధ్యమైందన్న భావన చాలా మందిలో కలిగింది. ఆయనను పల్లెత్తు మాట అననివ్వని మిత్రులు అనేక మంది తమ ప్రొఫైల్స్‌ నుంచి మోదీ బొమ్మలు తొలగించుకోవడం చూశాను.

అయినప్పటికీ మోదీని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆయన ఏమి చేసినా చేయకపోయినా నేరుగా ప్రజలకు కనెక్టు అయ్యే మంత్రం తెలిసినవాడు. ఎన్నికలు సమీపించగానే భావోద్వేగ రంజితమైన నినాదాలను రేకెత్తించి, వివేకాన్ని, విచక్షణను పూర్వపక్షం చేసి జనాన్ని బుట్టలో వేసుకునే తెలివితేటలు ప్రదర్శించే అవకాశం ఉంది. కొందరిని కొంతకాలం మభ్యపెట్టవచ్చు. అందరిని అన్నిసార్లు మోసం చేయలేరు అన్న నానుడి ఒకటి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. పెట్రో ధరలు, అధిక ధరలు, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం, రాజ్యాంగ వ్యవస్థలతో శీర్షాసనం వేయించే దుర్మార్గపు ధోరణి, వ్యాపార వర్గాలకోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టే శాసనాలు, కార్మికులను నిరాయుధులను చేసిన కార్మిక చట్టాలు, రైతులను గాలికి వదిలేసే వ్యవసాయ చట్టాలు-ఇవన్నీ ఏమేరకు ప్రజల హృదయాలను తాకుతాయ్యన్నదే దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.

పోత పోసిన ఉన్మాదం

రాజా సిద్ధార్థ

ఈ విశ్వం పుట్టినప్పటి నుంచి అవతరించిన మనుషులు, మహానుభావులు, మహాపురుషులు, చక్రవర్తులు, దేవుళ్ళు, దేవదూతలు ఏ ఒక్కరూ చావుపుట్టుకల చక్రభ్రమణాన్ని తప్పించుకోలేదు.

ఎంతటి అవతార పురుషుడయినా బోయవాడి బాణానికి గతించక తప్పలేదు. భావాలు, భ్రమలు తప్ప, ఎల్లకాలం బతికిన దేవుళ్ళు, దేవతలు లేరు. మళ్ళీ మళ్ళీ పుట్టినవారూ లేరు. ఒకటే జననం ఒకటే మరణం. మనిషికయినా, మనిషి రూపంలోని దేవుడికయినా.

భావాలు, భ్రమలు ఉన్నాయి కాబట్టి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుని అధ్యాత్మిక వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకునే ఆధునిక దేవుళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఉన్నన్నాళ్ళు భావాలను, భ్రమలను, మూఢ నమ్మకాలను పెంచి పోషించి, మహా లింగాలను, మహామందిరాలను, విశాలమైన ప్రార్ధనా స్థలాలను ప్రతిష్టించిన వారు, నిర్మించినవారు కూడా ఏదో ఒక రోజు దేహం కృశించి, చితికి చేరవలసిందే.

మంత్రాలు, తంత్రాలు, సృష్టి ప్రతి సృష్టి, పునర్జన్మ, పూనకాలు అన్నీ మనిషి మనో జనిత భావనలు. మనం సృష్టించుకున్న భావనలు మనలను బలితీసుకోవడం విషాదం. మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను పెంచి పోషించే గురువులు, స్వాములు, వారి శిష్య పరమాణువులు, వారికి విలువనిచ్చి వారి ఆశ్రమాలను, మందిరాలను, ప్రార్ధనా స్థలాలను సందర్శించే పెద్దమనుషులు అందరూ ఈ పాపంలో భాగస్వాములే.

శాస్త్రీయ దృక్పథాన్ని, విచక్షణ, వివేకాలను అందించని చదువులు దండగ.

Jingoists-Enemies of Human Race

Jingoism, in the name of race, religion, nationality brought two World Wars, which killed about 100 million population including civilians and soldiers. Except about two dozen countries entire human race suffered with these bloody wars prompted by power mongering, expansionist, racist aka nationalist, egoistic, arrogant, ignorant, dictatorial rulers.  

Jingoist rulers always try to divert the people of their country from real issues and drag them into easy slopes of sentimental and emotional trajectories showing big picture of some internal and external enemies. In the garb of race, religion or nationality they grab your votes and then they try to rob your hard earned money, your jobs and rights.

 They ask you to eat religion, breathe religion, death for religion. They steal a human being in you, the very human nature in you.  They blind your mind and heart. They make you a Jihadi. Jihadi of any religion might be Islam or Christianity or Hinduism is dangerous to human race. They are enemies of human race.