బీజేపీ నేతల వంకరతనం


DSC_9680_F

బ్రిటిష్ వాడు ఎడ్విన్ లుటేన్స్ నిర్మించిన పార్లమెంటు భవనాల్లో మనం ప్రభుత్వమే నడుపుకోవచ్చు. నిజాము నిర్మించిన రాజ ప్రసాదాల్లో అసెంబ్లీ కొలువుదీరవచ్చు.

ఎర్రకోటలో ఉత్సవాలెందుకు అని ప్రధాని నరేంద్ర మోడీని అడుగుతావా కిషన్ రెడ్డీ? ఎర్ర కోటలో నియంతృత్వం కాకుండా ప్రజాస్వామ్యం నడిచిందా నాయకా? బ్రిటిష్ వాడు ఎడ్విన్ లుటేన్స్ నిర్మించిన పార్లమెంటు భవనాల్లో మనం ప్రభుత్వమే నడుపుకోవచ్చు. నిజాము నిర్మించిన రాజ ప్రసాదాల్లో అసెంబ్లీ కొలువుదీరవచ్చు.

భాజపా నేతల్లో తెలంగాణా వచ్చినా వంకర తనం పోలేదు. కమలాన్నిచూడమంటే దానికింది బురదను మాత్రమే చూడడం అలవాటైంది వీరికి. ఆంధ్రలో అధికారంలో భాగస్వాములుగా ఉండి మీరు పోడుస్తున్నదేమీ లేదు. తెలంగాణాకు కరెంటు పీకేసినా మీకు నొప్పి అనిపించదు.

గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం రాజరిక పునాదులై ప్రజాస్వామ్య పతాకం ఎగురవేయడంగా ఎందుకు కనిపించడం లేదు? తెలంగాణా చారిత్రిక వైభవాన్ని చాటిచెప్పడంగా ఎందుకు అనిపించలేదు? సాంస్కృతిక ప్రతీకలను పునరుద్దరించడంగా ఎందుకు భావించడం లేదు. మాట్లాడితే దేశాన్నిగతంలోకి తీసుకెళ్ళే భాజపా ఇప్పుడుమాత్రం ఎందుకు సనుగుతున్నది?

మీరు ఎప్పుడు మారతారు?

Author: kattashekar

Former Editor, Namasthe Telangana Daily

2 thoughts on “బీజేపీ నేతల వంకరతనం”

  1. RIGHT ANSWER….And also
    We supporting/appriciated Flagasting progremm in all historical forts in Telangana and A.P.

Leave a comment